చరణ్ ఎన్టీఆర్ అభిమానులు సంతోషపడండి…!
రాజమౌళి తన కొత్త సినిమా త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అని ప్రకటించినప్పటినుండి అభిమానుల ఆనందంకు హద్దు లేకుండా ఉన్నది. రాజమౌళి ఈ సినిమాలో ఏ హీరోకి ఎక్కువ ప్రాధాన్యతగా చూపిస్తాడో అని అభిమానులు బాగా ఆలోచనలోపడ్డారు. ఇటువంటి సమయంలో ఈ సినిమాకు మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ అని తెలియగానే అభిమానులు కొంత స్టిమిత పడ్డారు. తాజాగా బుర్రా సాయి మాధవ్ ఒక ఇంటర్వూ లో మాట్లాడుతూ రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు మంచి సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పడంతో ఇద్దరి స్టార్ హీరోల అభిమానులకు అనుమానాలు పటాపంచల్ అయ్యాయి. ఈ సినిమాలో రాజమౌళి కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రలను బ్యాలెన్స్ చేశాడని తాను కూడా ఇద్దరికీ సమానంగా డైలాగులు రాశానని అన్నాడు. ఇది విన్న హీరోల అభిమానులు హ్యాపీ గా ఫీల్ అయ్యారు.
https://youtu.be/M-Z4JuG7Br4





